అమాయకులను హత్య చేశారు.. వైసీపీ నేతలపై బాలకృష్ణ ఫైర్..!

-

గత వైసీపీ ప్రభుత్వం పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో ఎందరో అమాయకులను హత్యలు చేశారని  మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఏపీలో రోడ్లు దారుణంగా మారాయని.. దీంతో ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానమైన హిందుపురం నుండి బరిలోకి దిగిన బాలయ్య.. సమీప వైసీపీ అభ్యర్థినిపై ఘన విజయం సాధించారు. తాజుగా విజయంతో బాలయ్య ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సారి చంద్రబాబు కేబినెట్ లో -బాలయ్యకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది.. మరీ బాలయ్యను మంత్రి పదవి వరిస్తుందా లేదా అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.

Read more RELATED
Recommended to you

Latest news