ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ప్రాణాలొదిలిన విద్యార్థి … !

-

ప్రభుత్వాలు ఎంతగా విద్యార్థులకు ప్రాణాల విలువను తెలియచేస్తున్నా… పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం పోయినట్లు కాదని ఎంత చెబుతున్నా కొందరు విద్యార్థులు మాత్రమే ఇవేమీ అర్ధం కానట్లు క్షణికావేశంలో, ఒక్క క్షణం ఎటువంటి ఆలోచన చేయకుండా నూరేళ్ళ జీవితాన్ని బలితీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. హైద్రాబాద్ లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ప్రజ్వల అనే విద్యార్హ్ది ఫలితాలను తెలుసుకోగా , ఫెయిల్ అయ్యాడు. దీనితో ఇక ఈ ఫలితాన్ని తట్టుకోలేక ప్రజ్వల తీవ్ర మనస్థాపం చెంది తన ఇంటిలోనే ఉరేసుకుని తన ప్రాణాలను వదిలేశాడు.

 

దీనితో ప్రజ్వల బంధువుల ఇంట్లో విషాదం నిండిపోయింది. మంగా ప్రజ్వల స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతం. చదువు కోసం ఇక్కడకు వలస వచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థుల్లారా ఒక్క పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ అందరూ పోస్ట్ లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news