పాకిస్థాన్​లో లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది దుర్మరణం

-

ఓవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​లో తరచూ రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గిల్గిత్ బాల్టిస్థాన్​లోని దయామిర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న ఓ ప్యాసింజర్​ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. చీకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news