రఘునందన్ రావు, జీవన్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ !

-

గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్ ,రఘునందన్ రావులు నివాళులు అర్పించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని అమర వీరుల సాక్షిగా చెబుతున్నానని అన్నారు. ఇక ఈ సందర్భంగా రఘునందన్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి మధ్య గన్ పార్క్ లో ఆసక్తికర చర్చ జరిగింది.

బీజేపీ ఎమ్మెల్యేలు వస్తుంటే జీవన్ రెడ్డి నమస్కారం పెట్టారు. దీంతో ఏమన్నా కాలేజ్ కి వచ్చావా ? లేక అసెంబ్లీకి వచ్చావా అని జీవన్ రెడ్డి డ్రెస్సింగ్ ని చూసి రఘునందన్ రావు సెటైర్ వేశారు. ఎందుకొచ్చిన గోలలే అని వేల్లిపోబోతున్న ఆయనని ఎందుకు భయపడుతున్నారు రా ఫోటో దిగుదాం అని రఘునందన్ రావు అనగా, నాకు భయమెందుకు మీకే భక్తి లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అలానే మాది భయపడే పార్టీ కాదన్నా అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news