రకుల్​ ప్రీత్ సింగ్ తొలి సంపాదనతో ఏం చేసిందో తెలుసా?

-

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్​ ప్రీత్​ సింగ్​. దశాబ్దకాలంగా చిత్రసీమలో హీరోయిన్​గా రాణిస్తున్న ఈ లక్కీ బ్యూటీ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తునే మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. ఇక సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్​తో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. అలాగే ఫిట్​నెస్​కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ అమ్మడు. ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించినా హిందీలో మాత్రం ఫుల్​ బిజీగా గడుపుతోంది. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…

ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌. చిన్న హీరోలు, స్టార్ హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించి స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించి యూత్​లో ఫుల్​ క్రేజ్​ సంపాదించుకుంది. ప్రస్తుతం గ్లామర్​ పాత్రల నుంచి వైవిధ్యమైన పాత్రల వైపు అడుగులేస్తోంది.

అయితే ఈ అమ్మడు దిల్లీలోని సిక్​ కుటుంబంలో జన్మించింది. అయినా పదహారణాల తెలుగు ఆడపడుచులా తన అందం,నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. 2011లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన రకుల్.. ఆ తర్వాత ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటడ్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ సొంతం చేసుకుంది. 18ఏళ్ల వయసులో మోడలింగ్​లోకి అడుగుపెట్టింది. అప్పుడే నటి అవ్వాలని నిర్ణయించుకుంది.

2009లో కన్నడ సినిమా గిల్లితో వెండితెర అరంగేట్రం చేసింది. అయితే తొలి సినిమా పాకెట్​ మనీ కోసం చేసినట్లు చెప్పింది. గతంలో ఓ సందర్భంగా తన మొదటి సంపాదనతో కారు కొనినట్లు తెలిపింది. ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అలా అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్​ప్రెస్, రఫ్​, లౌక్యం, కరెంట్​తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​2, స్పైడర్, మన్మథుడు 2 ఇలా బ్యాక్​ టు బ్యాక్​ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్​లో ఫుల్​ క్రేజ్​ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో కొండపొలంలో మూవీలో తాను చేసిన డీగ్లామర్​ రోల్​ మర్చిపోలేని అనుభూతినిచ్చిందని ఓ సారి చెప్పింది.

కెరీర్​ ప్రారంభం నుంచే తెలుగు సినిమాలు చేస్తూనే హిందీలో అదృష్టం పరీక్షించుకుంది. 2013లో యారియన్​ చిత్రంతో బాలీవుడ్​ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అయ్యారి, దేదే ప్యార్​ దే, సర్దార్​ కా గ్రాండ్ సన్​ వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్​లో కాస్త జోరు తగ్గించి పూర్తిగా బీటౌన్​పై ఫోకస్​ పెట్టి అక్కడి స్టార్​ హీరోలతో నటించడం ప్రారంభించింది. అలా అటాక్​, రన్​వే 34, డాక్టర్​ జి, థ్యాంక్ గాడ్​, కట్​పట్లీ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఛత్రివాలీ, మేరీ పత్నీ కా రీమేక్​, ఇండియన్​ 2, 31 అక్టోబర్​ లేడీస్​ నైట్​ చిత్రాల్లో నటిస్తోంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కసరత్తులు చేసే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపదు. ఎక్కడు ఉన్నా ఎక్సర్సైజులు చేస్త ఫిట్​నెస్​కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలా ఫిట్​నెస్​ బ్యూటీగా పేరు గాంచింది. జిమ్ మాత్రమే కాదు.. ఏరోబిక్స్, యోగా కూడా చేస్తుంది.

ఇక మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. జిమ్​ సెంటర్లను నిర్వహిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోనూ ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‌ను ఏర్పాటు చేసింది. దిల్​ హై దీవానా, నా దూజ కోయి, మషూక వంటి మ్యుజిక్ ఆల్బమ్​ వీడియోస్​లోను మెరిసింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో చిత్రాలను ఉత్తమ నటిగా అవార్డులను అందుకుంది.

ఇక గ్లామర్​, ఫిట్​నెస్ సీక్రెట్​ గురించి చెప్పింది. జ్యూస్‌ కంటే కూడా డైరెక్ట్​గా పండ్లు తినడమే తనకు ఇష్టమని చెప్పింది. అలా అయితేనే, వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయని అదే గ్లామర్​, ఫిట్‌నెస్‌ రహస్యం అని వెల్లడించింది. గుజరాతీ థాలీ, గులాబ్‌ జామూన్‌, ఆలూ పరాటా తన ఫేవరెట్​ ఫుడ్​. స్టార్‌ హోటల్స్‌తో పోలిస్తే.. ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందట. ప్రస్తుతం ఈ అమ్మడు నటుడు జాకీ భగ్నానీతో రిలేషన్​షిప్​లో ఉంది. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news