ఐపీఎల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న వార్నర్ సేన… !

-

అహమ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఢిల్లీ ఓటమి కేవలం ఆరు ఓవర్ లలోనే ఖరారు అయినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ టీం.. వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతోంది. గుజరాత్ టైటాన్స్ ఏస్ బౌలర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ ఆటగాళ్ల భరతం పట్టాడు. పవరు ప్లే లో మహమ్మద్ షమీ మూడు ఓవర్ వేయగా కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లను సాధించాడు. ఇందులో సాల్ట్ (0), ప్రియం గార్గ్ (10), రాసౌ (8), మనీష్ పాండే (1) ల వికెట్లను పడగొట్టి ఢిల్లీ ని కొలుకోనీయకుండా చేశాడు.

కాగా ఈ సీజన్ లోనే అత్యంత చెత్త రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట రాసుకుంది. కేవలమా పవర్ ప్లే లో 5 వికెట్లు కోల్పోవడం ఇదే మొదటిసారి. ఇక ఈ స్థితి నుండి ఢిల్లీ లేచి పోరాడే స్కోర్ ను సాధించి గెలవడం అయ్యేపనేనా ?

Read more RELATED
Recommended to you

Latest news