IPL 2023 : ఢిల్లీ టాప్ లేపిన 34 ఏళ్ళ మిస్టరీ స్పిన్నర్ !

-

ప్రస్తుతం ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా, ఢిల్లీ మొదటి బ్యాటింగ్ లో ప్రస్తుతం కష్టాల్లో ఉందని చెప్పాలి, త్వరగానే మొదటి వికెట్ ను కోల్పోయినా ఆ తర్వాత వార్నర్ మరియు మనీష్ పాండే లు జాగ్రత్తగా ఆడుతూ 43 పరుగుల పార్టనర్ షిప్ ను జత చేశారు. ఆ తర్వాత ముంబైకి చెందిన 34 సంవత్సరాల మిస్టరీ స్పిన్నర్ పీయూష్ చావ్లా మాయ మొదలైంది.

ముందుగా మనీష్ పాండే (26) ను బోల్తా కొట్టించగా , ఆ తర్వాత ప్రమాదకరమైన పావెల్ (4) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ వెంటనే మరో బ్యూటిఫుల్ గూగ్లీ తో లలిత్ యాదవ్ ను బౌల్డ్ చేసి ముంబై శిబిరంలో ఆనందాన్ని నింపాడు. చావ్లా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులిచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news