ఐపీఎల్ 2023: ఆ లిస్ట్ లో టాప్ 2 కు దూసుకెళ్లిన గిల్ … !

-

ఈ ఐపీఎల్ లో సీజన్ మొత్తం పూర్తి అయిన తర్వాత కొన్ని పురస్కారాలను ప్లేయర్స్ అందచేస్తారు. అందులో అధిక పరుగులు, అధిక వికెట్లు, అధిక సిక్సులు, అధిక ఫోర్లు మరియు క్యాచ్ లు ఇలా చాలా విభాగాలు ఉంటాయి. కాగా ప్రస్తుతం సీజన్ లో అధిక ఫోర్లు జాబితాలో మొదటి స్థానానికి ఇద్దరు ప్లేయర్స్ మధ్యన భారీగా పోటీ ఉండనుంది. అయితే ఇద్దరూ కూడా ఇండియాకు చెందిన ప్లేయర్స్ కావడం విశేషం. వారిలో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన యశస్వి జైస్వాల్ ఒకరైతే.. గుజరాత్ టైటాన్స్ కు చెందిన శుబ్ మాన్ గిల్ మరొకరు. వీరిద్దరూ వారి జట్లకు ఓపెనర్లుగా వచ్చి జట్టుకు విజయాలను అందిస్తున్నారు. ఇక వీరిద్దరూ అధిక ఫోర్లు విభాగంలో పోటీ పడుతున్నారు.

 

ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 74 ఫోర్లతో మొదటి స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానంలో శుబ్మాన్ గిల్ 60 ఫోర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక జైస్వాల్ మరియు గిల్ లకు మరో మ్యాచ్ మిగిలి ఉండగా ఇంకా కొన్ని ఫోర్లు చేసి మొదటి స్థానం కోసం పోటీ పడే అవకాశము ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news