IPL 2024 : చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు శుభ వార్త

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.అయితే ఈ మ్యాచ్ కి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ అందుబాటులోకి రానున్నారు. వీసా పనిపై బంగ్లాదేశ్కు వెళ్లిన అతడు గత మ్యాచ్కు దూరమయ్యారు. తాజాగా అతడు జట్టులో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ చెన్నై వేదికగా కేకేఆర్తో జరగనున్న మ్యాచ్కు ముస్తాఫిజుర్, పతిరణ అందుబాటులో ఉంటారని చెన్నై బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తెలిపారు.

కాగా, ఐపీఎల్ ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా చెన్నై సూపర్ కింగ్స్ 18, కోల్‌కతా నైట్ రైడర్స్ 10 మ్యాచుల్లో గెలిచాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ సీజన్లో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ కోల్‌కతా నైట్ రైడర్స్ 6 పాయింట్లతో రెండో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version