ఆ దేశాల కుట్ర వల్లే ఇరాన్‌లో అల్లర్లు : సుప్రీం లీడర్‌ అయతొల్లా

-

హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. భద్రతా దళాల అణచివేతలో ప్రాణాలు కోల్పోతున్నా తమ స్వేచ్ఛా హక్కుల కోసం నియంత పాలనకు ముగింపు పలకాలని తెగించి పోరాడుతున్నారు. మూడు వారాలుగా ఇరాన్‌లో కొనసాగుతోన్న ఆందోళనలపై ఎట్టకేలకు ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేని మౌనం వీడారు. దేశంలో జరుగుతోన్న నిరసనలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ల పథకం ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

‘పథకం ప్రకారమే ఈ అల్లర్లు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలకు ముఖ్య కారణం అమెరికా, యూదుల పాలకులు, వారి ఉద్యోగులేనని స్పష్టంగా చెబుతున్నా. ఇటువంటి ఘటనలు అసాధారణమైనవి’ అని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేని పేర్కొన్నారు.

దేశంలో కొనసాగుతోన్న నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోన్న ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవలే హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news