హత్యలు చేసిన అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఉండడం సిగ్గుచేటు – సిపిఐ నారాయణ

-

తిరుపతి జిల్లాలో జరిగిన సిపిఐ మహాసభల్లో పాల్గొన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటి దేశద్రోహి అమిత్ షా అన్నారు నారాయణ. హత్యలు చేసిన అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఉండడం సిగ్గుచేటని నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఇంటింటికి జెండా పేరుతో జాతీయ జెండాకు వెలకట్టి అమ్మారని విమర్శించారు.

వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతిగా వాడుకొని వదిలేసారని ఆరోపించారు. మోడీ అడుగుజాడల్లోనే జగన్ నడుచుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఖర్చు లేకుండా ఫ్రీగా బ్లూ ఫిలిం తీశారని విమర్శించారు. మాధవ్ దున్నపోతులా ఉండి బట్టలిప్పి తిరగడమే కాకుండా.. కులాల పేరుతో ఏదంటే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బిజెపి, వైసీపీ అరాచకాలను అణచాలంటే పోరాటాలు చేయక తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news