చెన్నై జట్టు ధోనీని వదులుకోవడమే బెటర్..!

-

భారత క్రికెట్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయే భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు. గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ టోర్నీలో 9వ జట్టును కూడా ప్రవేశించే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన ఆకాష్ చోప్రా ధోనిని ఉద్దేశంతో కీలక వ్యాఖ్యలు చేశాడు.

dhoni

ఒకవేళ ఐపీఎల్ లో 9వ జట్టు ప్రవేశం ఉంటే బిసిసీఐ మెగా వేలం నిర్వహిస్తుందని.. ఇక ఈ మెగా మేళ నిర్వహించిన సమయంలో సిఎస్కె యాజమాన్యం ధోని ని వదులుకోవడం ఎంతో ఉత్తమం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోనిని విడిచి పెట్టిన తర్వాత రైట్ టు కార్డు ద్వారా మళ్లీ జట్టులోకి తీసుకోవడం ద్వారా కాస్త లాభం చేకూరే అవకాశం ఉందని తెలిపాడు ఆకాష్ చోప్రా. ఒకవేళ ధోని రిటైన్డ్ ప్లేయర్గా కొనసాగితే పదిహేను కోట్ల పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news