భారీ ధరకు అమ్ముడుపోయిన విరూపాక్ష థియేట్రికల్ రైట్స్..!

-

సాయి ధరంతేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. అసలు విషయంలోకెళితే గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరంతేజ్ కోలుకున్న తర్వాత చేస్తున్న సినిమా విరూపాక్ష.. ఈ సినిమా ద్వారా కార్తీక్ వర్మ దండు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇక ఈ సినిమాను బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాదు ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరొకవైపు ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే విరూపాక్షా సినిమాకి కాంతారా సినిమాకి పనిచేసిన అజినీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించడం విశేషం. మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండగా.. ఇటీవల షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇకపోతే ఏప్రిల్ 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రికార్డు ధరకు విరూపాక్ష థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోందిరూ. 22 కోట్ల మేర వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ప్రవీణ్ భారీ ధరకు దక్కించుకున్నాడు . కాగా సాయిధరమ్ తేజ చివరి చిత్రం రిపబ్లిక్ .. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ సినిమా చిత్ర రైట్స్ భారీ ధర పలకడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది . మొత్తానికైతే సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమాతో విడుదలకు ముందే గట్టెక్కాడు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news