BREAKING : భార్య నామినేషన్‌ కు జడేజా.. ఫోటోలు వైరల్‌

-

 

గుజరాత్ ఎన్నికల అభ్యర్థులను బిజెపి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకటించిన జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా.. పేరు కూడా ఉంది. ఆమెను నార్త్ జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బిజెపి బరిలోకి దింపుతోంది.

ఇక ఇవాళ రవీంద్ర జడేజా సతీమణి రివాబా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అయితే, గుజరాత్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి క్రికెటర్ రవీంద్ర జడేజా మరియు అతని భార్య మరియు బిజెపి నాయకుడు రివాబా జడేజా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత… రవీంద్ర జడేజా సతీమణి రివాబా..నామినేషన్‌ వేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి జడేజా హాజరై.. అందరికీ ఆశ్చర్యపరిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news