కార్లలో గుండాలను తీసుకొచ్చి రైతులపై దాడులు చేస్తున్నారు : బండి సంజయ్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్

-

ధాన్యం కొనుగోలు అంశంపై టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. అయితే ఈ పర్యటపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా రైతుల పై బండి సంజయ్ గుండాల దాడిని ఖండిస్తున్నామని ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ వంద కార్ల లో గుండాలను తీసుకొచ్చి రైతుల పై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బండి సంజయ్ చిచ్చు పెడుతున్నాడని నిప్పులు చెరిగారు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బండి సంజయ్ కేంద్రంతో చెప్పించాలని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు నిలదీస్తే బండి సంజయ్ గుండాలు దాడి చేస్తుండ్రని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. రైతులకు ఒక టిఆర్ఎస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news