బండి సంజయ్ తలతిక్క మాటలు మాట్లాడుతున్నారు. – జగదీష్ రెడ్డి.

-

రాష్ట్ర బీజేపీ ఎవరి మెడలు వంచుతారు.. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైరయ్యాడు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు  చేయడంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాటకాలు అడుతుందని ఘాటుగా విమర్శించారు. బండి సంజయ్ తలతిక్క మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం యాసంగిలో వడ్లను సాగు చేయాలని అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ప్రశ్నించారు.

గతంలో యాసంగిలో కొన్న ధాన్యాన్నే కేంద్రం సేకరించలేదని.. ఇప్పుడు వానాకాాలం పంటకు కిరికిరి పెడుతున్నారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలు, ప్రాణాలు బీజేపీకి పట్టవని విమర్శించారు. యాసంగిలో వడ్లు సాగు చేస్తే కేంద్రం కొంటుందో కొనదో చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్లు వేయకుంటే ఏ పంటను సాగు చేయాలో .. కేంద్రమే చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రైతులు కూడా ఏ పంటను సాగు చేయాలని ప్రశ్నిస్తున్నారని .. దానికి కేంద్రం బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని… జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news