BREAKING : ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న జగన్‌, విజయమ్మ

-

BREAKING : ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్‌ మో హన్‌ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ. కాసేపటి క్రితమే.. ఇడుపులపాయ నుంచి.. వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ నేపథ్యంలోనే… సీఎం జగన్‌, విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభ స్థలిపై ఎక్కారు సీఎం జగన్‌.

కాగా.. వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు నేడు, రేపు గుంటూరు వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షపడిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాటు చేస్తున్న వైసీపీ శ్రేణులు. అటు ఇవాళ సాయంత్రం సీఎం జగన్‌.. పార్టీని ఉద్దేశించి 1.20 గంటలు మాట్లాడననున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు అధ్యక్షుడు జగన్ ముగింపు ఉపన్యాసం ఉండనుండగా.. గంటా 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు జగన్. కార్యకర్తలను, పార్టీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న జగన్.. మూడేళ్ల పాలన, భవిష్యత్ ప్రణాళికను ప్రజల ముందు పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news