వైసిపి ఎమ్మెల్సీ కారుకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

-

ఆంధ్రప్రదేశ్ వైసిపి శాసన మండలి సభ్యుడు సి.రామ చంద్రయ్య కారుకు గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కడప కో-ఆపరేటివ్ కాలనీలో ఆయన ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారుకు గుర్తుతెలియని దుండగులు గత రాత్రి నిప్పు పెట్టారు. దీంతో స్వల్పంగా తన ఇన్నోవా కారు కాలింది. అయితే ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడలో ఉన్నారు.

ఈ ఘటనపై ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 2018 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య గతంలో టిడిపి, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. కాగా వైయస్సార్ సిపి పార్టీ తరఫున ఏప్రిల్ 1, 2021 న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news