ఏపీ ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం శుభవార్త..

-

ఏపీ ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తోలుత 9 గంటలకు ఒక్క నిమిషం లేట్ అయిన ఆబ్సెంట్ గా పరిగణించేలా యాప్ ను సిద్ధం చేశారు.

cm jagan
cm jagan

ఉపాధ్యాయ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో దిగొచ్చిన ప్రభుత్వం 9 గంటలకు మరో 10 నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఉపాధ్యాయులు 9.10 గంటల లోపు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు వేసుకోవచ్చు. అలాగే మరికొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. నెట్ వర్క్ సమస్యల కారణంగా యాప్ పనిచేయకుంటే ఆఫ్లైన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చు.

ఉపాధ్యాయులు పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోయి స్కూలుకు వస్తే సహోపాధ్యాయుల సెల్ ఫోన్ ద్వారా, లేదంటే ప్రధానోపాధ్యాయుడు సెల్ ఫోన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చు. అలాగే, డిప్యూటేషన్, శిక్షణ తదితర వాటికి వెళ్లినప్పుడు, ఆన్ డ్యూటీ లో ఉన్న వారి కోసం ఈనెల 25 నుంచి ప్రత్యేకంగా లీవ్ మాడ్యూల్ ను తీసుకురానుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సెలవుల వివరాలను కూడా యాప్ లోనే అప్ డేట్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news