రేపు రాఖీ పండుగ ఉన్న తరుణంలో వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. రాఖీ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

రక్షాబంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని శ్రీ వైయస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.