జగన్ రెడ్డి ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటుంది – నారా లోకేష్

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ రెడ్డి గారి ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడ్డాడని ఓ దళిత యువకుడికి శిరోముండణం చేశారంటూ ట్విటర్ వేదిక ద్వారా ఫైర్ అయ్యారు. ” జగన్ రెడ్డి గారి ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటోంది. ఇసుక అక్రమ రవాణాకి అడ్డుపడ్డాడని దళిత యువకుడు వరప్రసాద్ కి శిరోముండనం చేసింది వైసిపి ప్రభుత్వం.

ఇప్పుడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లపల్లెలో ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించి అడ్డుకున్నందుకే యువకుడు కిషన్ ని ఇసుక మాఫియా హత్య చేసిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కిషన్ ని హత్య చేసిన ఇసుక మాఫియా, దాని వెనుక ఉన్న వైసిపి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలి.”. అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news