మాధవ్ చుట్టూనే తిరుగుతున్నారుగా!

-

ఏపీలో ఇంకా వేరే సమస్య లేనట్లు…ప్రతిపక్ష టీడీపీ..వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపైనే రాజకీయం చేస్తుంది. అందులో నిజనిజాలు  తేలే వరకు వదిలేలా కనబడటం లేదు. ఈ నెల మొదట్లో మాధవ్ పేరుతో ఓ న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే…అయితే ఇది ఫేక్ అని, టీడీపీ వాళ్ళు చేసిన పని అని అప్పుడే మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని చెప్పారు. దీనికి కౌంటర్ గా టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మాధవ్, వైసీపీపై విరుచుకుపడ్డారు. మాధవ్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే క్రమలో ఈ ఇష్యూ కాస్త కమ్మ-కురుబ కులాల మధ్య చిచ్చు రేగేలా పరిస్తితి వచ్చింది. కానీ కొందరు సముదాయించడంతో కులాల మధ్య కుంపటి రాజేసుకోలేదు. ఇలా జరుగుతున్న క్రమంలోనే అనంతపురం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి…మాధవ్ పేరుతో వచ్చిన వీడియో ఫేక్ అని అన్నారు…ఒరిజినల్ దొరికితేనే విచారణ చేస్తామని చెప్పారు. ఆ వెంటనే మాధవ్ మీడియా సమావేశం పెట్టి…చంద్రబాబు, లోకేష్…ఇంకా పలువురుని బూతులు తిట్టేశారు.. అది ఫేక్ అని మళ్ళీ చెప్పారు. ఇక మాధవ్ పై టీడీపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు.

సరే ఇష్యూ ముగిసిందిలే అనుకునేలోపు…అది ఒరిజినల్ వీడియోని అమెరికాలోని ఎక్లిప్స్ అని సంస్థ…ఇది రుజువు చేసిందని టీడీపీ నేత పట్టాభి ఓ రిపోర్ట్ బయటపెట్టారు. దీనికి కౌంటర్ గా వైసీపీ…అసలు టీడీపీ సృష్టించిందే ఫేక్ అని అన్నారు. ఆ వెంటనే సి‌ఐ‌డి చీఫ్ సునీల్ కుమార్ సైతం ప్రెస్ మీట్ పెట్టి..టీడీపీకి ఎక్లిప్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఫేక్ అని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో గ్రాఫిక్స్ చేసినట్లు చేశారని వివరణ ఇచ్చారు.

 మళ్ళీ వెంటనే సునీల్ కుమార్ కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది…సరే తమ రిపోర్ట్ ఫేక్ అనుకుంటే….ఆ వీడియోని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఫేక్ అని వైసీపీ..కాదు కాదు ఒరిజినల్ అని టీడీపీ…ఇలా అందరూ మాధవ్ వ్యవహారం చుట్టూనే తిరుగుతున్నారు..రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు టీడీపీ సైతం మాధవ్ పైనే ఫోకస్ పెట్టింది. మరి ఈ వ్యవహారం ఎప్పటికీ ఆగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news