BREAKING: ఎన్నికల ప్రచారంపై జగన్ సంచలన నిర్ణయం..

-

BREAKING: ఎన్నికల ప్రచారంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో సీఎం జగన్ క్యాంపెయిన్ చేయనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ విరామం తీసుకున్నారు. నేడు తాడేపల్లి నివాసంలోనే సీఎం జగన్ ఉంటారు. ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సమీక్ష చేయనున్నారు. రేపటి నుంచి యధావిధిగా సీఎం ఎన్నికల ప్రచారం చేస్తారు.

వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు రంగంలోకి దిగనున్నారు. ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ఎన్నారైల ప్రచారం ఉంటుంది. 4 బస్సుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నారై బృందాల పర్యటన ఉండనుంది. ఈ మేరకు నేడు బస్సు యాత్ర ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news