ఖమ్మం పోలీసులపై దండయాత్ర చేస్తాం – జగ్గారెడ్డి

-

ఖమ్మం పోలీసులపై దండయాత్ర చేస్తామని.. కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. 21వ తేదీన ఖమ్మం పోతున్నామని… కాంగ్రెస్ నేతలపై pd ఆక్టులు పెట్టిన కేసులపై సంగతి తెలుసా అని ప్రశ్నించారు. భట్టి కూడా మాట్లాడారని…పిసిసి చీఫ్.. భట్టి.. నేను అందరం వెళ్తున్నామని చెప్పారు. కార్యాచరణ చేస్తామని.. ఖమ్మలో ఎం చేస్తాం అనేది చూపిస్తామని హెచ్చరించారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

మా పార్టీ నాయకుల పై కేసులు పెట్టిన పోలీసుల పై దండయాత్ర చేస్తామని… బీజేపీ కార్యకర్త కుటుంబం నీ కూడా పరామర్శ చేస్తామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త లాగా కాదు.. సాధారణ పౌరుడిగా పరామర్శ చేస్తామని జగ్గారెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని… సీఎం కెసిఆర్ పరిపాలనలో విఫలం అయ్యారని ఆగ్రహించారు. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని… ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ కి పూర్తి సమయం ఇస్తానని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం తో ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news