వీరసింహా రెడ్డిలో జై బాలయ్య పాట ఐడియా ఎవరిదో తెలుసా..?

-

నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో బాలయ్య స్టైల్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పంచకట్టులోనూ బాలకృష్ణ స్టైలిష్ గా కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా డైరెక్టర్  గోపీచంద్ ఈ మూవీలో బాలయ్య స్టైలింగ్, జై బాలయ్య పాట ఎందుకు పెట్టారో వంటి ఆసక్తికర విషయాల గురించి చెప్పారు.

” జై బాలయ్య డైలాగ్​ ఓ ట్రెండ్ అయిపోయింది. అందుకే ఆ డైలాగ్ పెట్టాను. జై బాలయ్య పాట విషయానికొస్తే.. ఆ పదం ఓ ఎమోషన్​ అయిపోయింది. అందుకే ఆ పాట ఉంటే ఓ మ్యాజిక్ క్రియేట్​ అవుతుంది నేను తమన్ అనుకున్నాం. అందుకే​ చేశాం. అది వర్కౌట్ అయింది. ప్రేక్షకుల్ని ఆదరిస్తారని అనుకున్నాం. ఆదరించారు.” అని గోపిచంద్​ అన్నారు.

“అటు మాస్​ థియేటర్​లో ఇటు​ మల్టీప్లెక్స్​లో సినిమా చూశాను. మాస్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా​ బాగా కనెక్ట్ అయ్యారు. అసాధారణమైన రెస్పాన్స్ వచ్చింది. నా ఫోన్లు ఇప్పటివరకు మోగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్స్ చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాగా చూపించావని అంటున్నారు. బాలయ్య కాస్ట్యూమ్స్​ విషయానికొస్తే ఆయన క్యారెక్టర్​కు బాగా డెప్త్​ ఉంటుంది. డిజైన్​ చేసేటప్పుడే స్కెచెస్​ వేయించాను. ఆ తర్వాత బాల్యయకు అది చూపించాను. అయితే మొదట నా మనసులో బ్లాక్​ షర్ట్​ వేద్దాం అన్నప్పుడు బాలయ్యను అడగలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ అప్పుడే బాలయ్య కూడా తమ మనసులో బ్లాక్ ఉందని చెప్పారు. దీంతో నేను కూడా అదే అనుకున్నా సార్​ అంటూ డిజైన్ చూపించాను. ఇక యంగ్ లుక్ బాలయ్య కోసం భాస్కర్​ డిజైనర్​. ఆయన ప్రభాస్​కు పర్సనల్​ డిజైనర్​.” అని గోపిచంద్​ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news