’జై భీమ్‘ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలుస్తుంది.. ట్విట్టర్ లో ఎమ్మెల్యే సీతక్క

-

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ’జై భీమ్‘ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. కోలీవుడ్ స్టార్ సూర్య నిటించి నిర్మించిన జై భీమ్ సినిమాకు అన్ని వర్గాల ప్రైక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. మరోవైపు కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురువుతున్నా.. సినిమాను ఆదరించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి నాయకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై బీమ్’. మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తమిళనాడు సీఎం సహా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐఎండిబిలో ఈ చిత్రం అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది. హాలీవుడ్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసి ఈ ఫీట్ ను సాధించిన మొట్టమొదటి చిత్రం ‘జై భీమ్’ నిలిచింది. 

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాపై ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించింది. సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలిచి తీరుతుందని ఆశిస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. అణగారిన వర్గాల కోసం జరిగిన ఈ న్యాయ పోరాటం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. అయితే సీతక్క చేసిన ట్వీట్‌కు స్పందించిన హీరో సూర్య తమ చిత్ర బృందం తరఫున సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news