విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

-

విశాఖ ఎయిర్‌ పోర్టు కు కాసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్‌ పోర్టు కు జన సైనికులు మరియు అభి మానులు భారీగా చేరుకున్నారు. అంతేకాదు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో విశాఖ ఎయిర్ పోర్టు ప్రాంగణం మార్మోగిపోతోంది. ఈ సందర్భంగా ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించనున్నారు పవన్‌ కళ్యాణ్‌.

pawankalyan

ఎయిర్‌ పోర్టు నుంచి నేరు గా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రాంగణానికి వెళ్లి పరి రక్షణ సమితి ప్రతి నిధులను కలిసి వారు నిర్వహించే సభ లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లో పవన్‌ సభ ప్రారంభం కానుంది. ఇక అటు విశాఖ లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సభకు సర్వం సిద్ధమైంది. అయితే..ఈ బహిరంగ సభ కంటే… ఆ వేదికపై పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై అందరూ ఆసక్తి గా చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపైనే… కార్మికుల, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news