పీకే కూడా బీజేపీ ఏజెంటే..కేసీఆర్ పని అయిపోయింది – జితేందర్ రెడ్డి

-

పీకే కూడా బీజేపీ ఏజెంటే..కేసీఆర్ పని అయిపోయిందని జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మెదక్ లో రైతు అవగాహన సదస్సు నిర్వహించింది బీజేపీ. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ కు నేను,నా కుటుంబం అనే అహం పెరిగిందని.. రైతు లేకపోతే ప్రపంచమే లేదని పేర్కొన్నారు. రైతు బిడ్డలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నాడని… రైతు బాధ్యత వడ్లు పండించడం ..కొనడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు.

నేను వడ్లు కొనను అని సీఎం కేసీఆర్ అంటున్నాడని.. వడ్లు కొని కేంద్రానికి బియ్యం ఇస్తా అని రాసిచ్చి వచ్చాడు సీఎం కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు. ఏ రాష్ట్రం ఎంత బియ్యం ఇస్తారో అగ్రిమెంట్ చేశారు.గత వానాకాలం లో పండించిన దాన్యంతో ఎఫ్సిఐ కి ఎన్ని బియ్యం ఇచ్చారో స్పష్టం చేయాలని… హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందన్నారు. హుజురాబాద్ లోనే రైతులు,మహిళల పై కక్ష కట్టారని.. రైతు పండించిన ప్రతి గింజను కొంటామని కేంద్రం చెబుతుందని.. పికే సలహాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇక నీ ఆటలు సాగవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news