జైలు నుంచి విడుదలైన జర్నలిస్ట్ సిద్ధీఖ్ కప్పన్

-

కేరళ జర్నలిస్టు సిద్ధీఖ్ కప్పన్​ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూ జైలులో ఉన్న కప్పన్ విడుదల ఉత్తర్వులను బుధవారం రాత్రి జైలు యంత్రాంగం అందుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్​ నమోదు చేసిన కేసులో ఆయనకు కోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. చట్టపరమైన అన్ని కార్యకలాపాలను పూర్తి చేసిన తర్వాత కప్పన్​ను విడుదల చేసినట్లు జిల్లా జైలు సూపరింటెండెంట్ అధికారి ఆశిష్ తివారీ తెలిపారు.

2020 సెప్టెంబరు 14న ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు అక్టోబర్ 5న జర్నిలిస్టు కప్పన్ అక్కడికి బయల్దేరారు. మార్గమధ్యలో యూపీ పోలీసులు కప్పన్​ను చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు. కప్పన్ బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టు లఖ్​నవూ ధర్మాసనానికి దరఖాస్తు చేసుకున్నారు. అతడి అప్పీలును లఖ్​నవూ బెంచి కొట్టివేయటం వల్ల కప్పన్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news