టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లకు నిర‌స‌న‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధ‌ర్నా…!

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై వైసీపీ నేత‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి, నారా కుటుంబం నుండి ఒక్క‌క్క‌రూ వ‌చ్చి వైసీపీ నేతల వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. అయితే ఎన్టీఆర్ స్పందించిన తీరు సర‌గా లేదంటూ ప‌లువురు టీడీపీ నాయ‌కులు ఆరోపించారు.

దాంతో చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిర‌స‌న‌కు దిగారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అంతే కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్ కు వ్య‌తిరేఖంగా వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలోనూ ఎన్టీఆర్ అభిమానులు ప‌లుమార్లు ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఎన్టీఆర్ అభిమానులు చేసిన ధ‌ర్నా హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news