జూబ్లీహిల్స్ భూకబ్జా కేసులో టీజీ వెంకటేష్ కు ఊరట

-

ఇటీవల జూబ్లీహిల్స్ పరిధిలోని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వివరాలు సేకరించిన పోలీసులు.. అరెస్టయిన నిందితులు చెప్పిన వివరాల మేరకు టి.జి.వెంకటేష్ పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీజీ వెంకటేష్ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

అయినా కూడా పోలీసులు ఆయన పేరును కేసు నుంచి తొలగించ లేదు. తాజాగా ఈ కేసును మరింత మేరా క్లారిటీ తెచ్చుకున్న పోలీసులు టి.జి.వెంకటేష్ పేరును ఎఫ్ఐఆర్ లో నుంచి తొలగించారు. భూకబ్జా కేసు నుంచి ఆయన పేరును తొలగిస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో టిజి వెంకటేష్ కు ఆదివారం భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news