టాలీవుడ్ మరో విషాదం.. సినిమా ఆర్టిస్ట్ సూసైడ్ !

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి కరోనా మహమ్మారి తో పాటు వరుస విషాదాలు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయన్న సంగతి తెల్సిందే. అయితే.. తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినిమా ఆర్టిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చాంద్రా యణ గుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధి లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సైద్‌ రహీమ్‌ అనే 24 సంవత్సరాల యువకుడు సినిమా ఆర్టిస్ట్‌ గా పని చేస్తున్నాడు. పలు సినిమాల్లో నటించిన సైద్‌ తాజా గా సుసైడ్‌ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం తో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి పోస్ట్‌ మార్టం నిమిత్తం తరలించారు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తు న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news