KA పాల్ : అవినాష్ రెడ్డిని దోషిగా చిత్రీకరిస్తున్నారు…

-

ఆంధ్రప్రదేశ్ మాజీ వైసీపీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తన విచారణను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. కానీ అవినాష్ రెడ్డి ఎందుకనో వివిధ కారణాలతో సిబిఐ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. మూడు రోజుల క్రితం అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ అనారోగ్య కారణంగా సిబిఐ విచారణకు హాజరు కాలేదు. కాగా ఈ రోజు హైద్రాబాద్ లో ఆమె చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

అయితే అవినాష్ ను సైతం కలిసిన పాల్.. అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని చెబుతున్నాడని, ఎవరో కావాలంటే ఈ కేసులో తన దోషిగా చిత్రీకరించడానికి పాన్గ్లు చేస్తున్నారని చెప్పినట్లుగా పాల్ మీడియాతో చెప్పడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news