కామారెడ్డి : గుండెపోటు వ‌చ్చిన వ్య‌క్తికి చికిత్స చేస్తుండ‌గా డాక్ట‌ర్ కు గుండెపోటు..!

-

ఇటీవ‌ల కాలంలో గుండెపోటు మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. చిన్న వ‌య‌సులోనే గుండె పోటు భారిన ప‌డుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రీసెంట్ గా చిన్న వ‌య‌సులోనే న‌టుడు పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా గుండె పోటు వ‌చ్చిన వ్య‌క్తి ఆస్ప‌త్రి వెళ్లగా అత‌డికి చికిత్స చేస్తూ డాక్ట‌ర్ కూడా గుండె పోటుతో మ‌ర‌ణించారు.

వివ‌రాల్లోకి వెళితే….కామారెడ్డి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. గుండె పోటు రావ‌డంతో గాంధారి మండ‌లం గ‌జ్జ‌ల్ తాండాకు చెందిన వ్య‌క్త‌ ట్రీట్మెంట్ కోసం గాంధారిలోని న‌ర్సింగ్ హోమ్ కు వ‌చ్చారు. అయితే అత‌డికి చికిత్స చేస్తున్న క్ర‌మంలోడాక్ట‌ర్ ల‌క్ష్మిణ్ కు సైతం గుండె పోటు వ‌చ్చింది. దాంతో ఆయ‌న కుప్ప‌కూలిపోయి అక్క‌డే మ‌ర‌ణించారు. దాంతో పేషంట్ ను కామారెడ్డి త‌ర‌లించే ప్ర‌యత్నం చేశారు. కాగా మార్గ మ‌ధ్యలోనే అత‌డు కూడా మ‌ర‌ణించాడు. ఇద్ద‌రూ మ‌ర‌ణించ‌డంతో గాంధారి మండ‌లంలో విషాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news