కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…. బస్సు బోల్తాపడి 8 మంది దుర్మరణం, పలువురికి గాయాలు

-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా పల్లవ హళ్లి కట్ట వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్గటన కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో సంభవించింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రైవేటు బస్సు హోసకోట నుంచి బయటదేరిన బస్సు పావగడకు వెళ్తుండగా పల్లవహళ్లి కట్ట వద్దకు రాగానే బోల్తా పడింది. ప్రమాదం సమయంలో 60 మంది దాకా ఉన్నారు. వీరిలో 8 మంది మరణించగా…25 మంది వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది.

ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కిక్కిరిసిన మందితో బస్సు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయాల తీవ్రతను బట్టి చుట్టుపక్కల ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రైవేటు బస్సు యాజమాన్యాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓనర్ ను అదుపులోకి తీసుకుని బస్సులో ఎంత మంది వెళ్లారు… ప్రయాణికులు వివరాలను తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news