రాజ‌కీయాల్లోకి అంబ‌టి రాయుడు.. ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫ‌ర్

-

రాజ‌కీయాల్లోకి రావ‌డానికి సినిమా స్టార్లే కాకుండా.. క్రికెటర్లు కూడా ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్ వేణుగోపాల రావు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీలో చేరారు. అంతే కాకుండా కొన్ని రోజుల పాటు రాజ‌కీయాల్లో చుర‌కుగా ప‌ని చేశాడు. స‌మావేశాల‌కు, ఆందోళ‌న‌న‌లో కూడా వేణు గోపాల రావు పాల్గొన్నారు. అయితే వేణు గోపాల్ రావు.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత జ‌నసేన పార్టీకి దూరం గా ఉన్నారు. అయితే ఆయ‌న‌న మ‌రోసారి జ‌న‌సేన పార్టీలోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజా గా మరో క్రికెటర్ కూడా రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌ని స‌మ‌చారం. టీమిండియా నుంచి ఇటీవ‌లే రిట‌ర్మెంట్ తీసుకున్న అంబ‌టి రాయుడు రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తుంది. అంబ‌టి రాయుడుకు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఉన్న ఒక ప్ర‌ముఖ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌డానికి కూడా సిద్ధంగా ఉంద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా రాలేదు. కానీ అతి త్వ‌ర‌లోనే.. అంబ‌టి రాయుడు రాజ‌కీయా ప్ర‌వేశం ఉంటుంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news