పోసాని-నటుడు విశ్వనాధ్ మధ్య వైరం పై క్లారిటీ ఇచ్చిన నటుడు..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు నటుడు కాశీ విశ్వనాథ్. ఈయన కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాశీ విశ్వనాథ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వాటికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ తన వివాహం పెద్దలు కుదిర్చిన వివాహమని తెలియజేశాడు. ఇండస్ట్రీలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ అవి తనకి నచ్చకపోవడంతో చేసుకోలేదని తెలియజేశారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లుగా తెలియజేశారు. ఇలాంటి సమయంలోనే నటుడు పోసాని కృష్ణమురళి తనకు మధ్య భేదాభిప్రాయాలు గురించి కూడా కాశీ విశ్వనాథ్ తెలియజేయడం జరిగింది. కాశీ విశ్వనాథ్ ను సినీ ఇండస్ట్రీలో మొదట అందరూ తనకు ఎక్కువ అహంకారం ఉండేదని భావించేవారని తెలియజేశారు.

ఒకసారి పోసాని రాసిన కథలలో ఎన్నో తప్పులు ఉన్నాయని.. ఆ సమయంలో ఆ తప్పులను చూసి ఆ విషయాలను పోసానికి చెప్పానని తెలియజేశారు. ఇక దాంతో తన గురించి పోసానికి ఎవరు తప్పుగా చెప్పారని ఆయన తెలియజేశారు. పోసాని తనకు మంచి మిత్రుడు అయినప్పటికీ ఎవరో చెప్పిన మాటలు విని తనని కొంతకాలం పాటు దూరం పెట్టాడని కాశీ విశ్వనాథ్ తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఇండస్ట్రీలో తను కొంతమందికి నమస్కారం చెప్పలేదని ఫీలయ్యేవారు అని తెలియజేశారు కాశీ విశ్వనాథ్.

తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఎన్నో అవమానాలు కూడా పడ్డానని వాటన్నిటినీ తట్టుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని తెలియజేశారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో తనని కొంతమంది డైరెక్టర్ టార్చర్ చేసేవారని కూడా తెలిపారు. వాటన్నిటినీ తట్టుకొని నిలబడడంతో సినిమా ఇండస్ట్రీ లో ఉండే సీనియర్ నటుడు నరేష్, శుభలేఖ సుధాకర్ వంటివారు తనని మెచ్చుకున్నారని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news