బంగారు తెలంగాణ కాదు… తండ్రి కొడుకులు అవినీతి తెలంగాణగా చేశారు: రాజాసింగ్

-

వచ్చే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రెండు వందల శాతం ఏర్పడుతుందని… బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తుందని రాజాసింగ్ అన్నారు. రానున్నది హిందు రాజ్యం వస్తుందని, నిజాం రాజ్యం పోతుందని అన్నారు. 8వ నిజాంగా కేసీఆర్ అనుకుంటున్నారని.. మా అమిత్ షా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గా మారి మెడలు వంచుతారని రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో హిందూ విరోధులను పారద్రోలాలని పిలుపునిచ్చారు. అక్బరుద్ధీన్, అసదుద్దీన్ ఓవైసీలను తెలంగాణ పారద్రోలుతామని అన్నారు. ఓల్డ్ సిటీ ముస్లింలకు ఏం చేయలేదని.. మహారాష్ట్రకు వెళ్లి ఔరంగజేబు సమాధిపై పూలు చల్లుతున్నారని విమర్శించారు. శివాజీ, ఔరంగజేబుకు నీళ్లు తాగించిన విధంగానే మిమ్మల్ని కూడా ఆ పరిస్థితికి తీసుకువస్తామని హెచ్చరించారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి… తండ్రి కొడుకులు కలిసి అవినీతి తెలంగాణగా మార్చారని… మీ అవినీతి అంతానికే అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని రాజాసింగ్ అన్నారు. వచ్చేది బీజేపీ, హిందూ రాజ్యమే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోండంటూ ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Latest news