రేపు కాంగ్రెస్ పార్టీలోకి కత్తి కార్తిక

-

2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒకరి తరువాత మరొకరు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ నుంచి రివర్స్ మైగ్రేషన్ కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో టీఆర్ఎస్ ఓవర్లోడ్ కాగా, అధికార పార్టీలో అసంతృప్తులు ఎక్కువై కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇతర పార్టీ నేతలే కాక స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి క్యూకట్టారు.

మొన్నటికి మొన్న పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కగా రేపు కత్తి కార్తీక గౌడ్ గాంధీభవన్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు 11:00 గంటల సమయంలో పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క ల సమక్షంలో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news