కత్రినా కైఫ్ ఇన్​స్టా పోస్ట్​కు ఎంత చార్జ్ చేస్తోందో తెలుసా?

-

భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్​ హీరోయిన్స్​లలో కత్రినా కైఫ్ ఒకరు. మోడల్ నుంచి నటిగా మారిన కత్రిన ‘బూమ్​’ అనే చిత్రంతో బాలీవుడ్​లోకి అడుగుపెట్టారు. ‘జరా జరా టచ్ మి’, ‘చిక్నీ చమేలీ’, ‘షీలా కీ జవానీ’…’ఖ్వాబ్ దేఖే’ వంటి సూపర్-హిట్ ఐటెమ్ సాంగ్స్​తో కుర్రకారులో క్రేజ్​ సంపాదించుకున్నారు.

సినిమాల్లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్​ ఎక్కువే. దాదాపు 65 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కైఫ్… బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇంతకీ ఆమె ఇన్‌స్టా ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు ఎంత సంపాదిస్తారో తెలుసా?

ఇండియన్​ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్​ హీరోయిన్స్​లో కత్రినా కైఫ్ ఒకరు. మోడల్ నుంచి నటిగా మారిన కత్రినా ‘బూమ్​’ అనే చిత్రంతో బాలీవుడ్​లోకి అడుగుపెట్టారు. 2005లో రిలీజైన రొమాంటిక్-కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యున్ కియా’ కత్రిన సినీ కెరీర్​కు బ్రేక్​ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత , ‘నమస్తే లండన్’, ‘వెల్‌కమ్’, ‘పార్టనర్’, ‘న్యూయార్క్’ లాంటి సినిమాలతో బిటౌన్​లో బిజీ అయిపోయారు.

‘జరా జరా టచ్ మి’, ‘చిక్నీ చమేలీ’, ‘షీలా కీ జవానీ’…’ఖ్వాబ్ దేఖే’ వంటి కొన్ని సూపర్-హిట్ ఐటెమ్ సాంగ్స్​తో కుర్రకారులో క్రేజ్​ సంపాదించుకున్నారు. 2019లో కైఫ్.. తన కాస్మెటిక్ బ్రాండ్ కే బ్యూటీని ఈ-కామర్స్ కంపెనీ నైకా భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఇందులో పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్​ లభ్యమవుతాయి. సినిమాల్లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్​ ఎక్కువే.. దాదాపు 65 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కైఫ్.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.

తాజా మీడియా నివేదికల ప్రకారం, ఈ ‘చిక్నీ చమేలీ’ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు సుమారు రూ. 97 లక్షలు వసూలు చేస్తుందని సమాచారం. స్లైస్, నక్షత్ర, పానాసోనిక్, లాక్మే, లోరియల్, రీబాక్ ఇండియా, ఇమామి, లినో పెరోస్ లాంటి అగ్రగామి బ్రాండ్లకు ప్రమోషన్స్​ చేస్తుంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ.. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ‘జీ లే జరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అలియా భట్, ప్రియాంక చోప్రా కూడా నటించారు. దీంతో పాటే ‘ఫోన్ భూత్’ అనే మూవీలో సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్​తో కలిసి నటించారు.

కాగా, కెరీర్​ ప్రారంభంలో తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాల్లోనూ కనువిందు చేశారు. ఆ తర్వాత బీటౌన్​లో బిజీ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news