తాగుబోతుల రాష్ట్ర సమితిని..బంధిపోట్ల రాష్ట్ర సమితిగా మార్చాడు – వైఎస్ షర్మిల

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మరోసారి వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. తాగుబోతుల రాష్ట్ర సమితి(TRS)ని బంధిపోట్ల రాష్ట్ర సమితి(BRS)గా మార్చాడు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ తప్పదని హెచ్చరించారు వైఎస్‌ షర్మిల. కేసీఆర్ పోలీసులను పనోళ్లలా వాడుకుంటున్నాడు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును పందికొక్కుల్లా పీక్కుతిన్నాడు. ఇక్కడ దోచుకోవడానికి ఏమీ లేదని, దేశం మీద పడ్డాడని ఆగ్రహించారు.

KCR పాలనలో ఉద్యోగులకు కూడా భరోసా లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను చిత్రహింసలకు గురి చేసిండు. RTC సంఘాలను ఆగం జేసిండు. టీచర్లయితే భర్త ఒక చోట.. భార్య ఒక చోట. VRAలు 77రోజులుగా సమ్మె చేస్తున్నా.. 34మంది చనిపోయినా, పుస్తెలమ్ముకుని ఇల్లు వెళ్లదీస్తున్నా KCRకు కనికరం లేదని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల.

ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని వైయస్ఆర్ గారు ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చారు. వలసలను అరికట్టారు. పోచారం డ్యాం కాల్వల ద్వారా 20వేల ఎకరాలకు సాగు నీరు అందించారు. మోడల్ రెసిడెన్షియల్ కాలేజీ నిర్మించారు. రూ.120కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news