మోడీని ప్రశ్నిస్తే ఇదే ప్రతిఫలం : ఎమ్మెల్సీ కవిత

-

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపేదాకా పోరాడతామని అన్నారు కవిత. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, మహిళా సంఘ ప్రతినిధులతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని లే మెరిడియన్‌ హోటల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టాల్సిన అంశంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని.. కానీ అవి అమలు కావడం లేదని అన్నారు తెలిపారు.

‘ఆకాశంలో సగం.. ధరణిలో సగం.. అవకాశంలో సగమని మహిళలకు సమానమైన స్థానం ఉండాలని మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో పోరాడుతున్నాం. మహిళా బిల్లు ఆమోదం కోసం మొన్న జంతర్‌మంతర్‌లో ధర్నా చేశాం. దీనికి కొనసాగింపుగా ఇవాళ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నాం. ఇందులో అన్ని పార్టీలను పిలుచుకుని పార్లమెంటులో ఏం చేయాలనే దానిపై చర్చిస్తాం. వారి మద్దతు కూడగడడతాం.. ఈ మీటింగ్‌కు రాని పార్టీలపై భవిష్యత్తులో ఒత్తిడి పెంచి కలిసొచ్చేలా చేస్తాం’ అని అన్నారు కవిత.

 

 

Read more RELATED
Recommended to you

Latest news