కెసిఆర్ ఫ్యామిలీని మోడీ సర్కార్ టార్గెట్ చేసింది – అసదుద్దీన్ ఓవైసీ

-

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్సీ కవిత, బిఆర్ఎస్ పార్టీ సర్కార్ పై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు మద్దతుగా నిలిచారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీని మోడీ సర్కార్ టార్గెట్ చేసిందని ఆరోపించారు. బిజెపి ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బాయికాట్ చేయాలని పిలుపునిచ్చారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం అంతర్గత అభివృద్ధి కొరకు కేసిఆర్, కెసిఆర్ కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉందంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. తెలంగాణలో అభివృద్ధి కారణంగానే కక్ష సాధింపులో భాగంగా కేంద్రం ఇలా వ్యవహరిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news