సికింద్రాబాద్ అల్లర్ల వెనుక కెసిఆర్ హస్తం ఉంది: డీకే అరుణ

-

జూలై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తుంది బిజెపి నాయకత్వం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా స్థానిక నేతలు పాల్గొననున్నారు. కాగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించింది బిజెపి బృందం. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సభకు పది లక్షల మంది వస్తారని చెప్పారు డీకే అరుణ.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.

సికింద్రాబాద్ అల్లర్ల వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ సమాజం మోదీ నాయకత్వంలోని బిజెపి వైపు చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ మాటలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. అగ్నిపధ్ పై మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిందే కేసీఆర్ హయాంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించే శక్తి కేసీఆర్ కు లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news