గ్రేటర్‌లో శాంతి భద్రతలపై కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు..బండి సంచలన వ్యాఖ్యలు.

-

హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తెలంగాణ సీఎం కుట్రలు చేస్తున్నారన్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు‌..పీవీ ఘాటును సందర్శించి నివాళులు అర్పించారు..తెలుగు ప్రజలం ఆత్మగౌరం అయినా పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలన్న అక్బర్‌ వ్యాఖ్యలపై స్పందించక పోవడం దారుణం అన్నారు బండి..తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారి ఘాట్లను కూల్చడమంటే దేశ ద్రోహమే అని..అక్బర్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు సంజయ్‌.మరోవైపు గ్రేటర్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా వ్యవహరిస్తున్నారని..సీఎం దగ్గర సమాచారం ఉంటే వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు..పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేయాలన్నారు..గ్రేటర్‌లో ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించడానికి బీజేపీ పూర్తిగా సహాకరిస్తుందన్నారు.. సిద్దంతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ ఘాటుకు నివాళులర్పిస్తుంటే ఎన్టీఆర్‌కు భారత రత్నా ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తెవడం రాజకీయ దిగజారుడు తనమే అన్నారు బండి సంజయ్‌..తెలంగాణ బీజేపీ ఎన్టీఆర్‌కు భారత్ ఇవ్వాలన్న డిమాండ్‌ను సమర్థిస్తున్నామని..అవసమైతే ఏపీ బీజీపీ అధ్యక్షుడితో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు సంజయ్‌..

Read more RELATED
Recommended to you

Latest news