మరో కాసేపట్లో నోముల అంత్యక్రియలు.. హాజరుకానున్న కేసీఆర్

-

ఈ రోజు నకిరేకల్ మండలం, పాలెం లోని వ్యవసాయ క్షేత్రంలో.. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు హాజరై ఎమ్మెల్యే నోములకు పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 11.25 కు పాలెం చేరుకొనున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 1న తెల్లవారు జామున ఎమ్మెల్యే నోముల హాఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.

అమెరికా నుంచి చిన్న కూతురి రాక కోసం 1వ తేదీ రాత్రి నుంచి ఎమ్మెల్యే పార్థివదేహం కామినేని మార్చురీలో భద్రపరిచారు. కూతురు నిన్న చేరుకోవడంతో కామినేని నుంచి నకిరేకల్ స్వంత ఇంటికి ఎమ్మెల్యే పార్థివదేహాన్ని తరలించారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం 9 తర్వాత అంతిమయాత్ర ప్రారంభం కానుంది. స్వగ్రామమైన పాలెంలోని తన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు జరగనున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news