అలా జరగకపోతే రాజకీయాలనుండి తప్పుకుంటా – ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోదాడ కొమరబండ వద్ద మామిడి తోటలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి తన భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి పాల్గొన్నారు ఉత్తంకుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయాయి అని ఆరోపించారు.

వచ్చే ఎన్నికలలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గిన రాజకీయ సన్యాసం తీసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనకి పదవులు, ఆస్తులపై వ్యామోహం లేదన్నారు ఉత్తంకుమార్ రెడ్డి. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్ధంగా పనిచేశానని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news