తిరుపతిలో కిడ్నాప్ అయిన బాలుడు దొరికాడు..పిల్లలని విక్రయించే ముఠా పనే ?

-

కొద్ది రోజుల క్రితం తిరుపతిలో కిడ్నాప్ జరిగిన ఘటన సంచలనంగా మారింది. తిరుపతిలో కిడ్నాప్ కు గురైన ఛత్తీస్గఢ్ బాలుడి ఆచూకీ లభ్యం అయింది. గత నెల 27వ అలిపిరి సమీపంలో  ఛత్తీస్గఢ్ కు చెందిన శివకుమార్ సాహో అనే బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. కిడ్నాప్ చేసిన చిత్తూరు జిల్లా వి. కోటకి చెందిన నిందితుడు శివప్ప కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా వి. కోటలో పిల్లలని అపహరించి విక్రయించే ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో వీ.కోట సరిహద్దు కర్ణాటక గ్రామాల్లో సైతం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చత్తీస్‌గఢ్‌‌ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. తిరుమల వెళ్లబోతూ ఫుట్‌పాత్‌ మీద సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ సమయంలో వారి పక్కనే కూర్చున్న ఓ వ్య​క్తి బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news