శాఖను మార్చడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ…

-

తాజాగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మంత్రిత్వ శాఖను ఉన్నపళంగా మార్చడంతోజాతీయ స్థాయిలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఈయన శాఖను న్యాయశాఖ నుండి ఎర్త్ అండ్ సైన్సెస్ శాఖకు తరలించారు… ఇది కిరణ్ రిజిజు కి పనిష్మెంట్ అంటూ ఎవరికీ నచ్చినట్లు వారు కామెంట్ లు చేస్తుండడంతో కిరణ్ రిజిజు తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. కాసేపటి క్రితం మీడియా వేదికగా మాట్లాడిన కిరణ్ రిజిజు నా శాఖను మార్చడం పూర్తిగా ప్రధాని మోదీ నిర్ణయం అని… ఇందులో నేను చేసిన పొరపాటు ఏమీ లేదని.. ఇది నాకు పనిష్మెంట్ అంతకంటే కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇది పూర్తిగా మోదీ విజన్ లో భాగమే మరియు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం నన్ను మార్చారని కిరణ్ రిజిజు తెలిపాడు.

ఇంతకు ముందు వరకు న్యాయశాఖకు మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ను ఎర్త్ అండ్ సైన్సెస్ శాఖకు మంత్రిగా మార్పు చేశారు. కాగా ఇంతకు ముందు కిరణ్ రిజిజుకి క్రీడా శాఖామంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news