రోడ్లపై కార్లు కాదు.. పడవలు తిరుగుతున్నాయి..!

-

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొన్నటికి మొన్న వరదల్లో హైదరాబాద్ నగరం మురిగిపోయిన విషయాన్ని తెర మీదకు తెస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది బిజెపి పార్టీ. తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరినీ మోసం చేశారు అంటూ మండిపడ్డారు. డబుల్ బెడ్ రూములు ఇస్తారు అని నమ్మకంతోనే టీఆర్ఎస్కు ప్రజలు ఓటు వేశారని కానీ ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఊసే ప్రభుత్వం మరచిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ ఎప్పుడో కోల్పోయారని… విమర్శించారు. అయితే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం గా మారుస్తామని కెసిఆర్ చెప్పారని కానీ చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ నగరంలో కార్లకు బదులు రహదారులపై పడవలు తిరుగుతున్నాయి అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news